Chandamama Story Books In Telugu New Books - Magazines for sale - Chandamama is a classic Indian Telugu monthly It also published long-running mythological/magical. CHANDAMAMA TELUGU CHILDRENS STORIES - PDF EBOOK JUNE 2012 at 02:53 Reactions: Email This BlogThis! Share to Twitter Share to Facebook Share to Labels. I am helpless in this matter because I am outside Kerala. Free PDF Books PDF Books World library is a high quality resource for free PDF books, which are digitized version of books attained the public domain status.
ఒక కాకి ఎప్పుడు హంసలను చూసి కుళ్ళు కునేది. వాటి తెల్లటి రెక్కలని, అందమైన రూపాన్ని చూసి కాకి బాధ పాడేది. ఎప్పుడు “నేనూ అలా వుంటే బాగుండేది!
ఇలా నల్లగా వున్నాను” అనుకుంటూ వుండేది. ఒక రోజు కాకికి ఒక మూర్ఖమైన ఆలోచన కలిగింది. హంసల లాగానే తనూ నీళ్ళల్లో ఉంటూ, వాటిలా కలుపు మొక్కలు తింటూ, చెరువులో ఈత కొడుతూ వుంటే అదీ చాలా అందంగా అయిపోతున్దనుకుంది ఆ పిచ్చి కాకి. మొన్నాటి నుంచి నానా ప్రయత్నాలు చేసింది.
గాలిలో ఎగరడం మానేసి నీళ్ళల్లో ఈత కొట్టడానికి తెగ ప్రయత్నం చేసింది. కాని కాకికి ఈత రాదు కదా! అలవాటు లేని కాలుకు మొక్కలు తింటే అవి పడక, తినలేక, పాపం కాకి చిక్కి సల్యమయిపోయింది. అయినా పాపం చాలా రోజులు అలాగే ప్రయత్నం చేసింది. కాని అందంగా తయారవడము కాదు కదా, ఉన్న బలం కూడా కోలి పోయింది. ఇంక ఇది లాభం లేదని, అలవాట్లు మార్చినంత మాత్రాన్న రూపం మారిపోదని తెలుసుకుని కాకి ఆ పైన హంసలను చూసి అసూయ పాడడం మానేసింది. Image: Ritu Jagya/Shutterstock.com, used under license from Shutterstock.com.
Please do not copy or reproduce. అనగనగా ఒక రహదారిలో రాము, గిరి అనబడే ఇద్దరు బాటసారులు కలిసి ప్రయాణం చేస్తున్నారు. దారిలో అనుకోకుండా గిరికి ఒక సంచి కనిపించింది. ఆ సంచి తెరిచి చూస్తే అందులో బంగారు నాణాలు ఉన్నాయి! “నేను యెంత అదృష్టవంతుడిని, నాకు అనుకోకుండా ఇంత బంగారం దొరికింది!” అని గిరి రాముతో అన్నాడు. “నేను అదృష్టవంతుదిని అనకు, మనం అదృష్టవంతులము” అని రాము బదులు చెప్పాడు.
“అదెలా కుదురుతుంది? సంచి నాకు దొరికింది కనుక బంగారమూ నాడదే, అదృష్టము నాదే! మనం కాదు; నేను అదృష్టవంతుడిని!” అని గిరి కోపంగా అన్నాడు. రాము గొడవ పడడం ఎందుకులే అనుకుని ఊరుకున్నాడు. ఇంతలో వెనక నుంచి “దొంగ! దొంగా!” అని అరుపులు వినిపించాయి.
వెనక్కి తిరిగి చూస్తే కొంత మంది కోపంగా కర్రలు, కట్టెలు పట్టుకుని పరిగెత్తుకుంటూ వస్తున్నారు! మన దెగ్గిర కనుక ఈ సంచి చూస్తే మనం దొరికిపోతాము. వాళ్ళు మనల్ని చితక్కోట్టేస్తారు!” అని గిరి ఖంగారు పడ్డాడు.
“మనం కాదు, నువ్వు దొరికిపోతావు. నిన్ను చితక్కోట్టేస్తారు. ఈ సంచితో నాకేమి సంబంధం లేదన్నావు కదా” అని కూల్ గా రాము జవాబు చెప్పాడు. మనం ఇతర్లతో మన అదృష్టం పంచుకోనప్పుడు వాళ్ళు మన దురదృష్టంలో కలిసి వస్తారనుకోవడం మూర్ఖత్వమే కదా! Image: Igor Malovik/Shutterstock.com, used under license from Shutterstock.com.
Please do not copy or reproduce. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగెళ్ళి, చెట్టుపై నుంచి శవాన్నిదించి భుజానవేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా స్మశానానికేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, “రాజా, విద్యాదికుదివైన నువ్వు, భీతగోల్పే ఈ స్మశానంలో, నిశిరాత్రి వేళ ఇన్ని కష్టాలను సాహిస్తున్నావంటే నమ్మసఖ్యం కాకుండా వున్నది. ఇంతకూ దీనికి కారకులు, నీ మంచితనాన్ని తమ స్వార్థం కోసం ఉపయోగించు కుంటున్న కుత్సిత మనస్కులై వుండాలి.
అలాంటి వాళ్ళ వలలో చిక్కి, కార్యసాధన తర్వాత అవివేకం కొద్దీ తనమేలును కూడా మరచిన అనటుడనే యువకుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను.” అంటూ ఇలా చెప్పసాగాడు: పూర్వం మందారకమే దేశాన్ని సత్కీరుడనే రాజు పరిపాలించేవాడు. విరజుడు, సత్కరుడి ఒక్కగానొక్క కొడుకు.
అతడికి కాస్త వయసురాగానే రాజు, అతణ్ణి గోబిలుడనే గురువు నడిపే గురుకులానికి పంపించాడు. గురుకులంలో మొత్తం పదిమంది విద్యార్దులున్దేవారు. వారిలో ఒక్క అనటుడనే విద్యార్ధి తప్ప మిగిలినవారందరూ, విరజుడు రాజుకుమారుడనే భయభక్తులతో కొంచెం ఎడంగా మసిలేవారు. అయితే అనంతుడు మాత్రం మొదటి రోజునే విరజుడిని ఆదరంగా పలకరించి స్నేహం కలుపుకున్నాడు. శాంతంగా, ఆత్మీయంగా ప్రవర్తించే అనంతుడు విరజుడికి కూడా నచ్చటంతో వారి స్నేహం దినదిన ప్రవర్ధమానం కాసాగింది.
అయితే, విరజుడిలో తను రాజకుమారుదనన్న అహంకారానికి మూర్ఖత్వం కూడా తోడూ కావడంతో, అనంతుడి మీద అప్పుడప్పుడూ అధికారం చలాయించేవాడు. అయినప్పిటికీ అనంతుడు కోపం తెచ్చుకోకుండా విరజుది పట్ల మిత్రభావాన్ని ప్రదర్శించేవాడు. విరజుడికి గురువు చెప్పే పాఠాలు ఒకంతట తలకేక్కేవి కాదు. అయితే అతడు గురువు దగ్గర ఏమీ మాట్లాడక, తీరిక సమయాలో అనంతుడిని వేధించేవాడు.
అనంతుడు ఏమాత్రం విసుగు చెందకుండా పాఠ్యాంశం విరజుడికి గ్రాహ్మయ్యేలా ఒకటికి నాలుగు సార్లు భోదించే వాడు. ఈ విధంగా విరజుడు చదువులో కాస్త చురుకుతనం పున్జుకోగానే, గురువు గోబిలుడు దాన్ని గమనించి, అతడికి మరింత ప్రోత్సాహజనకంగా వుండడం కోసం, అడపాదడపా ప్రశ్నించటం ప్రారంభించాడు. మొట్ట మొదటిసారి గురువు ప్రస్నించ గానే విరజుడు, అనంతుడితో, “అనంతా! ఈ రోజు గురువుగారు నన్ను ప్రస్నిన్చారంటే, ఆ ఘనత అంతా నీదే. నీ మేలు ఎన్నటికీ మర్చిపోను. నేను రాజునవగానే నిన్ను నా ప్రధాన మంత్రిని చేసుకుంటాను!” అన్నాడు.
విరజుడి మాటకు అనంతుడు చాలా సంతోషించాడు. గోబిలుడు కూడా ఆ సంగతి విని చాలా ఆనందించి, విరజుడిని మరింతగా మెచ్చుకుంటూ, “నాయనా, మనిషిని పశుత్వం నుంచి వేరు చేసే ఉత్తమ గుణాల్లో కృతజ్ఞత ఒకటి! నువ్వు అనంతుడి పట్ల చాలా ఉదాత్తంగా ప్రవర్తించావు. ఈ రోజు నువ్వు చేసిన వాగ్దానాన్ని కలలో కూడా విస్మరించకుండా నిలబెట్టుకో” అని హితవు పలికాడు.
విరజుడు అలాగేనన్నట్టు తలాడించాడు. అయితే, ఆ తర్వాత జరిగింది మాత్రం వేరు. అతడు క్రమేపీ చదువులో కొంత రాణిస్తూ, నానాటికీ అహంకారం పెంచుకుని, అనంతుడిని నిర్లక్ష్యం చేయడం ప్రారంభించాడు.
అలా కొంత కాలం గడిచి, ఇద్దరి విద్యాభ్యాసం ముగింపుకు వచ్చేనాటికి, విరజుడు తన వాగ్దానాన్ని పూర్తిగా మరిచినట్లు అందరికీ తెలిసిపోయింది. అనంతుడు గురుకులంలో తన విద్యాభ్యాసం ముగియగానే, గురువు గోబిలుడితో, “స్వామీ! నాకింకా విద్యా తృష్ణ తీరలేదు. తమరు అనుమతిస్తే, ఆరావళీ పర్వత పాదాల వడ్డన వున్న కృష్ణచంద్రులవారి గురుకులంలో కొన్నేళ్ళు విద్యాభ్యాసం చెయ్యాలని వుంది. ఆ తర్వాత అవసరమనిపిస్తే, విరజుడితో అతడు నాకు చేసిన వాగ్దానం గురించి మాట్లాడతాను.” అన్నాడు.
గోబిలుడు, అనంతుడు కోరిన దానికి సంతోషంగా, “ఆ మహనీయుడి దగ్గర శిష్యరికం చేసే పరిపూర్ణమైన అర్హత నీకుంది. వెళ్లిరా నాయనా, శుభస్య శీఘ్రం!” అంటూ ఆశీర్వదించి పంపించాడు. ఆ తర్వాత, విరజుడు కూడా గురు దక్షిణ చెల్లించి, రాజధానికి తిరిగి వెళ్ళాడు. నెమ్మదిగా ఆరు సంవత్సరాలు గడిచాయి. విరజుడికి పట్టాభిషేకం జరిగింది.
అతడు రాజవుతూనే, తనకు పూర్తీ అనుకూలంగా ప్రవర్తించే సుప్రతీకుదనేవాడిని తన ప్రధానసలహాదారుడిగా నియమించుకున్నాడు. పాలనా వ్యవహారాల్లో, ఈ ప్రధాన సలహాదారు మాట వేదవాక్యంగా చెల్లడం ప్రారంభించింది. సుప్రతీకుడు, రాజూ కలిసి వినూత్న పరిపాలన పేరిట, పరిపాలనలో అనేక మార్పులూ, సంస్కరణలూ ప్రవేశపెట్టారు. ఇందువల్ల ప్రజలు లేనిపోని అయోమయావస్థ లో పడి, తమకు అటువంటి దురవస్థ కలిగించిన రాజు పట్ల తీవ్రమైన అయిష్టత కనబరచ సాగారు. ఇదే ఊతంగా చేసుకుని పొరుగు రాజు, విరజుడి రాజ్యంపై దండెత్తాలను కుంటున్నాడని గూఢచారులవల్ల విరజుడికి తెలిసింది. విరజుడు కాస్త కొంగారుపడి, సుప్రతీకుడిని సంప్రదించాడు.
సుప్రతీకుడు తేలిగ్గా, “భయం ఎందుకు, ప్రభూ! మనం హేచ్చువేతనం మీద మరింత మందిని సైన్యంలో చేర్చుకుని, మనమే ముందుగా పొరుగురాజు మీద దండెత్తుదాం. ఆ రాజ్యం కూడా మనవసమైతే, తమరి కీర్తి ప్రతిష్ఠలు నలుదిశలా మరింత ఇనుమడిస్తాయి!” అన్నాడు.
“నువ్వు చెప్పెదీడీ చిటికలో ముగిసే పనికాదు. మన ఖజానాలో అంతగా నిల్వదబ్బు లేదని, నీకు తెలియనిదా?” అన్నాడు. దానికి సుప్రతీకుడు నవ్వి, “మన ఖజానా నింపేందుకు, ఒక తిరుగులేని ఉపాయం ఆలోచించాను. యక్షిణిశైలం గురించి మీకు తెలుసుగదా?” అన్నాడు. విరజుడికి యక్షిణి శైలం గురించి తెలుసు. మందార దేశానికి ఉత్తరపు టెల్లగావున్న పెద్ద పర్వతాన్ని యక్షిణి శైలం గా వర్ణించి చెబుతారు.
ఆ పర్వతం మీదవున్న ప్రాచీన శివాలయం ముఖమండపం దగ్గర, దేవనాగారలిపిలో వున్న ఒక శిలా శాసనం వుంది. అందులో, ఈ ఆలయం ముందున్న కోనేటి మధ్యభాగంలో నిరంతరం వేగంగా తిరిగేసుడి ఒకటున్నది. మంత్రం తంత్ర శాస్త్రజ్ఞాని, సాహసీ, నిస్వార్థ పరుడూ అయిన యువకుడు, ఆ సుడిలో ప్రవేశించి అక్కడ ఎదురయ్యే యక్షమాయను జయిన్చినట్లయితే, అతడికి అష్ట సిద్ధులూ, నవనిదులూ లభిస్తాయి, పరాజితుడైతే అక్కడి నుంచి నరక కూపంలోకి తోయ బాదుతాడు, అని వున్నది.
సుప్రతీకుడి మాటలో అదంతా గుర్తు తెచ్చుకుని విరజుడు బిక్కముఖం వేసి, “యక్షిణీ శైలం గురించి తెలిసి ఏం లాభం? ప్రాణాలకు తెగించి, ఆ కోనేటిలో దూకడం నా వల్ల కాదు!” అన్నాడు. ఆ జవాబుకు సుప్రతీకుడు నవ్వి, “అక్కడికి మిమ్మల్ని వెళ్ళమని చెప్పడం లేదు, ప్రభూ!
అనంతుడనే యువకుడొకడు కొత్తగా మన రాజ్యానికి వచ్చాడు. అతడు ఆరావళీ ప్రవత ప్రాంతంలోని కృష్ణ చంద్రుడనే గురూత్తముని వద్ద మంత్రం శాస్త్రాన్ని కూలంకషంగా అభ్యసించాడట. ఇతర విద్యలు కూడా అతడికి కరతలామలకాలేనట. అతడు మన వర్తకుల శ్రేష్టి ఇంట ఆతిధ్యం పొందారు.
ఆ అనంతుడు గొప్ప సాహసి అనీ, ఎన్నదగ్గ నేస్వార్తపరుడని ప్రజలు చెప్పుకుంటున్నారు. మనం ఆ అనంతుడిని పిలిపించి, రాజ్య క్షేమం కోసం యక్షిణి శైలికి వెళ్ళమని అడుగుదాము.
నిధులతో తిరిగి వస్తే, అతడి ఎట్టు బంగారాన్ని బహుమానంగా ఇస్తామని చెబుదాం. ఏమంటారు?” అని అడిగాడు. అనంతుడి పేరు వింటూనే ఉలిక్కి పడిన విరజుడు, ఒక్క క్షణం ఆలోచించి, సుప్రతీకుడు చెప్పిన దానికి అంగీకరించాడు.
మరుక్షణమే అనంతుడికి కబురు వెళ్ళింది. అనంతుడు రాగానే విరజుడు ఎంతో అభిమానంగా కుశల ప్రశ్నలు వేసాడు.
తర్వాత, యక్షిణిశైలాన్ని గురించి చెప్పిన దంతా శ్రద్ధగా విన్న అనంతుడు, “ప్రభూ! మనం ఒకరి గురించి ఒకరికి క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తులం. మీ కోరిక ప్రకారం నేనీ యక్షిణిశైలానికి తప్పక వెళతాను,” అన్నాడు.
అన్నమాట ప్రకారం అనంతుడు ఒకానొక సుముహూర్తాన యక్షిణిశైలానికి వెళ్లి మంత్రం జపించి కోనేటిలో దిగాడు. అనంతుడిటో బాటే వెళ్లి, కోనేటి ఒడ్డునే కూర్చున్న విరజుడికి, చాలా సేపు గడిచిన తర్వాత, అనంతుడు రెట్టింపు తేజస్సుతో ప్రకాశిస్తూ, కోనేటి నుంచి బయటకిరావడం కనిపించింది. అతడు వెంటనే అనంతుడి దగ్గిరకు వెళ్లి చెయ్యి పట్టుకుంటూ ఆతృత గా, “అనంతా!
నిధి దొరికిందా, ఏదీ?” అంటూ ప్రశ్నించాడు. అనంతుడు మందహాసం చేసి, “రండి, చూపిస్తాను, మీకెలాంటి ప్రమాదం కలగదు!” అని విరజుది చెయ్యి పట్టుకుని మళ్ళీ కోనేటిలో దిగాడు. దాని అట్టడుగున సూర్యకిరణాల్లా ప్రకాశిస్తున్న నవ రత్నాల గుట్టలు కనిపించాయి. విరజుడు మంత్రం ముగ్దుడిలా అయిపోయాడు. అప్పుడు అనంతుడు ప్రశాంతంగా, “ప్రభు! నేను సాధించిన ఈ అమూల్యమైన నిదినిక్షేపాల్ని, మీ కోరిక ప్రకారం రాజ్యక్షేమంకోసం వినియోగించేందుకు, ఈ క్షణమే మీ పరంచేస్తాను. అయితే దీనికి ప్రతిఫలంగా, మీ నుంచి నాకు కావలసింది బంగారం మాత్రం కాదు!” అన్నాడు.
ఆ మాటలకు విరజుడు చాలా ఆశ్చర్యపోతూ, “మరేమి కావాలి?” అని ప్రశ్నించాడు? మీరు పూర్వం గురుకులంలో చేసిన వాగ్దానం ప్రకారం, నన్ను మీ ప్రదానామాత్యుడిగా నియమించుకొంది. అదే నాకు కావలసింది!” అన్నాడు అనంతుడు గంభీరంగా. విరజుడు ఆ మాట వింటూనే కొద్ది క్షణాలు నోటమాట రాని వాడిలా వుండిపోయి, తర్వాత కాళ్ళ నీళ్ళు పెట్టుకుని వంగి అనతుడి పాదాలు స్పృశించి, “మహానుభావా! నువ్వు సామాన్య మానవుడివి కావు. ఈ క్షణం నుంఛీ నువ్వే నా ప్రధాన మంత్రివి!
నీ అనుజ్ఞ లేనిదే నేనిక ఊపిరి సైతం పీల్చను!” అన్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, “రాజా, నిధి సంపాదనలో, విరజుడి స్వార్థం తేట తెల్లమవుతూనే వుంది. ఎటొచ్చి ఎంతో విద్యాధికుడూ, సాహసీ అయిన అనంతుడి ప్రవర్తనే అవివేకంగా కనబడుతున్నది. అతడు నిస్వార్థ పరుడైన పక్షంలో నిధుల్ని విరజుడికి అప్పగించి ప్రతిఫలం ఏమీ ఆశించకుండా వెళ్లి పోవాలి. లేదా సాధించిన నిధిలో కొంత తీసుకోవాలి. అదీ గాక ఇదీ గాక, విరజుడు కపటి, అతడు చేసే వాగ్దానాలకు విలువలేదని ఎరిగి, మంత్రి పదవి కోరడం ఏమన్నా విజ్ఞత అనిపించు కుంటుందా?
ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పక పోయావా, నీ తల పగిలి పోతుంది!” అన్నాడు. దానికి విక్రమార్కుడు, “అనంతుడు మొదటి నుంఛీ రాజ్యక్షేమాన్ని కోరిన నిస్వార్థ పరుడు. అందుకే అతడు, భావి మహారాజైన విరజుడికి గురుకులంలో తగిన సహాయం చేశాడు. విరజుడు కపటి, స్వార్థ పరుడు కావచ్చు.
కాని, అప్పటి పరిస్థితుల్లో, ప్రజల వ్యతిరేకత, ఖజానాలో దానం లేకపోవడం, పొరుగురాజు దండ యాత్ర భయం, పాలనా వ్యవహారాల్లో సుప్రతీకుడి లాంటి అల్పగ్నుడి సలహాలు – వీటన్నిటి కారణంగా దేసరక్షణకు తనలాంటి వాడి అవసరం ఉన్నదన్న గట్టి నమ్మకం తోనే, అనంతుడు మంత్రి పదవిని కోరాడు. ఇది అతడి దేసభాక్తిని, రాజకీయ పరిజ్ఞాతాన్నీ చాటి చెబుతుంది. ఇది గొప్ప వివేకం. అవివేకం అంటూ ఇందులో ఏ మాత్రం లేదు!” అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే, బేతాళుడు శవంతో సహా మాయమై, మళ్ళీ తిరిగి చెట్టెక్కాడు.
Source: Chandamama, February 2004. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు,”రాజా, ఈ రాత్రి వేళ భీతిగొలిపే శ్మశానంలో నువ్వు ప్రదర్శిస్తున్న పట్టుదలా, శ్రమకు ఓర్చుకోగల శక్తి చూస్తుంటే, నాకు ఆశ్చర్యం కలుగుతున్నది. దేశ పాలకులైన రాజుల్లో ఇలాంటి గుణగణాలు సర్వ సాధారణం కాకపోయినా, అపూర్వం మాత్రం కాదు. దేశాన్ని సమర్థవంతంగ పాలించి, ప్రశాంత వాతావరణంలో దాన్ని వారసుల వరం చేయాలంటే, అందుకు కేవలం పట్టుదల, ధైర్య సాహసాలు మాత్రమే సరిపోవు, ఏంతో నిలకడ గల రాజనీతి, చతురత అవసరం. రాజుకు కావలసిన అన్ని మంచి లక్షణాలు వుండి, నిలకడగల రాజనీతి, చతురత్వం లోపించిన సత్యపాలుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను.” అంటూ ఇలా చెప్ప సాగాడు.
పూర్వం చందన దేశాన్ని పాలించే చంద్రపాలుడు హఠాత్తుగా మరణించడంతో ఆయన ఏకైక పుత్రుడు సత్యపాలుడు రాజయ్యాడు. రాజైన కొద్ది రోజుల్లోనే, అతడు దేశపు యదార్ధ స్థితిగతుల్ని గమనించి ఖిన్నుడయ్యాడు.
భోగ లాలసుదిన చంద్రపాలుడు, పరిపాలన చాలా వరకు ఉన్నతాధికారులు చేతుల్లో వదిలేసి, విలాస జీవితం సాగించాడు. అవకాశం అవినీతినిని సృష్టుస్తుందన్న దానికి సాక్ష్యంగా, అధికారులలో లంచగొండితనం, మోసబుద్దీ ప్రబలినాయి. దేశపు అంతరంగిక పరిస్థితులు ఇలా వుండగా, విదేశాల నుంచి కూడా చందనదేశానికి సమస్యల ఎదురు కాసాగాయి. చందనకు తూర్పు దిక్కున, చందన దేశాన్న అనుకుని ఒక భిల్లదేసం వున్నది.
తరతరాలుగా అది చందనకు సామంత దేశం. ఆ దేశాన్ని ప్రస్తుతం పాలిస్తున్న జయసేనుడు, స్వతంత్రం కోసం ప్రయత్నిస్తున్నాడని వేగులు వార్తా తీసుకుని వచ్చారు. ఇక, తూర్పుదిక్కున భిల్ల దేశాన్ని ఆనుకుని మహిర దేశం వున్నది. మిహిరను పాలిస్తున్న ప్రచండవర్మ, చందన దేశం లోని అరాజక పరిస్థితులను అవకాశంగా తీసుకుని, దేశాన్ని కబలించాలనే ఆలోచనలో వున్నట్లు ఆ వేగులే నమ్మకమైన వార్తలు తెచ్చారు.
ఇన్ని చిక్కుముడుల మధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన సత్యపాలుసు, ఒకనాడు మహామంత్రి కేవలభట్టుతో మంత్రాంగం సాగించాబోయాడు. అంతరంగిక సమస్యలకంటే, విదేశా సమస్యలకే మనం అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. అలా కానప్పుడు మనకు రాజ్యమే మిగలదు.
ఇన్న సమస్యలన్నీ చిటికెలో పరిష్కరమవాలంటే, ఒకేఒక్క ఉపాయం వున్నది!” అన్నాడు కేవలభాట్టు. “ఏమిటది?” అన్నాడు సత్యపాలుడు కుతూహలంగా. “మిహిరాధీశుడికి ఒక్క ఆడపిల్ల మాత్రమే సంతానం. ఆమెను మీరు వివాహమాదినట్లయితే, చిక్కులన్నీ ఇట్టే విడిపోతాయి. పెరిగిన మన బలం చూసి భిల్ల జయసేనుడు స్వతంత్రించడానికి సాహసించడు సరికదా, అవసరం అనుకుంటే మనమే అతణ్ణి మట్టుబెట్టి, ఆ దేశాన్ని కూడా మన రాజ్యంలో కలుపుకోగలం!” అన్నాడు కేవలభాట్టు.
సత్యపాలుడు ఆశ్చర్యంగా, “అదెలా సాధ్యం, మహామాత్య? ప్రచండవర్మ వియ్యపుటాలోచానలోనే వుంటే, అసలు యుద్ధప్రసక్తే వుండదు కదా?” అన్నాడు. కేవలభాట్టు క్షణం సంకోచించి, “ఆయనలో ఆ ఆలోచన లేనిమాట నిజమే, మహారాజా! కాని రాకుమార్తె మధులిక ఆలోచన మాత్రం అదేనని, మన వేగులు చెప్పారు. మనకు కూడా అదే ఆలోచన విన్నట్టు అదే వేగులుద్వారా ఆమెకు తెలియజేస్తేచాలు! అటునుంచి ఆమే నరుక్కోస్తుంది.” అన్నాడు. సత్యపాలుడు ఒక్క క్షణం మౌనం వహించి, చిరునవ్వుతో, “మధులిక ఆలోచనల గురించి మీకు చెప్పిన వేగులు, ఆమె అహంకారం గురించి చెప్పలేదా?” అని ప్రశ్నించాడు.
ఆ ప్రశ్నకు మంత్రి కేవలభాట్టు తడబడి, “ఆ మాట నిజమే మహారాజా! కాని ఆమె ఇంకా చిన్నపిల్లెగాడా.” అన్నాడు.
ఆ జవాబుకు సత్యపాలుడు చిరునవ్వు నవ్వి, అంతటితో మంత్రాంగం ముగించాడు. తనకు చుట్టుముట్టుతున్న సమస్యలకు పరిష్కార మార్గం ఏమిటి అని ఆలోచిస్తూ, వికలమైన మనస్సుతో, ఒకనాడు సత్యపాలుడు, కాన్చానగిరి పాడంవడ్డ ఆశ్రమ వాసం చేస్తున్న తన గురువును కలుసుకునేందుకు, ఒంటరిగా గుర్రం మీద బయలుదేరాడు.
గురుకులాశ్రమం ఇక కొద్ది దూరంలో వున్నదనగా, చిరుతపులి ఒకటి పొదల చాటునుంచి భీకరంగా గాండ్రిస్తూ, సత్యపాలుది గుర్రం మీదికి దూకింది. గుర్రం బెదిరి, సత్యపాలుడు ఎంత ఆపుచేయ్యబోయినా ఆగక, వాయువేగంతో పరిగెత్తిన పిమ్మట, సమీపం నుంచి ఒక చిత్రమైన ధ్వని వినిపించింది. ఆ ధ్వని వింటూనే గుర్రం శాంతించి, ఒక చెట్టు దగ్గిర ఆగింది. సత్యపాలుడు ఆ ధ్వనిని గుర్తుపట్టాడు. రెచ్చిపోయిన గుర్రాలను అదుపు చెయ్యడం కోసం, నేర్వరులైన భిల్లులు నోటితో చేసే విచిత్ర ధ్వని అది! ఆ సంగతి గ్రహించగానే, తను భిల్లరాజ్యపు పోలి మేరాలలో ప్రవేసిన్చానని గ్రహించిన సత్యపాలుడు, పరిసరాలను గమనిస్తూ, నెమ్మదిగా గుర్రం దిగాడు. ఇంతలో చెట్ల చాటునుంచి, భుజాన విల్లు, బాణాలు ధరించిన నూనూగు మీసాల భిల్ల యువకుడొకడు చిరునవ్వుతో సత్యపాలుడిని సమీపించాడు.
సత్యపాలుడు అతణ్ణి పరిశీలనగా చూస్తూ, “నోటితో ధ్వని చేసి గుర్రాన్ని అదుపు చేసింది నువ్వేనా?” అని ప్రశ్నించాడు. ఆ యువకుడు అవునన్నట్టు తలవూపి, బొంగురు గొంతుతో, “మీరీ చాలా అలిసిపోయి వుంటారు. కొద్ది సేపు అలా విశ్రమించండి, ఇప్పుడే వస్తాను!” అంటూ వెనుదిరిగి చెట్లు మధ్యకు వెళ్ళాడు. ఆ యువకుడి విలక్షణమైన స్వరూపానికీ, బొంగురుగా ధ్వనిస్తున్న అతడి కంఠస్వరానికీ ఆశ్చర్యపోయిన సత్యపాలుడు, ఏదో అనుమానం కలగగా చిరునవ్వు నవ్వుకుంటూ, ఒక చెట్టు కింద కూర్చున్నాడు.
కొద్ది సేపటికి ఆ యువకుడు, ఒక చేతిలో కొన్ని మధుర ఫలాలు, మరొక చేతిలో ఒక తాబెతికాయలో నీళ్ళు తీసుకువచ్చి, సత్యపాలుడికి అందించాడు. సత్యపాలుడు అవి అందుకుంటూ, “నన్ను గుర్తుపట్టి నువ్వు చేస్తున్న ఈ పనులకు సంతోషం. నాతోబాటు వచ్చేవంటే, నా ఆస్థానంలో మంచి పదవి ఇచ్చి ఋణం తీర్చుకుంటాను.” అన్నాడు. ఆ యువకుడు చిన్నగా నవ్వి, “నేను నా విశి నేరవేర్చాను, అంటే! అందుకు గాను ఏ ప్రతిఫలమూ అవసరం లేదు, వస్తాను!” అంటూ వేల్లిబోయాడు. వెంటనే సత్యపాలుడు కోపంగా, “నేను సార్వభౌముడిని, మీది సామంత దేశమని తెలిసి, ఈ మాటలు మాట్లాడుతున్నావా?” అని ప్రశ్నించాడు. యువకుడు ఆగి, “నన్ను జయసేనుడి కుమార్తె కీర్తిసేనగా గుర్తుపట్టారని, నాకు తెలుసు!
నన్ను రెచ్చగొట్టి పరీక్షించాలనే, అలా ఆహాన్కారపూరిటంగా మాట్లాడారు.” అన్నది కీర్తిసేన. ఆ మాటలకు సత్యపాలుడు నవ్వుతూ, “అర్ధమైంది, కీర్తిసేనా! బొంగురు గొంతు నీకు, అహంకారం నాకు స్వభావాలంకారాలుగా రాణించలేదు.” అంటూ లేచి నిలబడి, “ఇక వెళ్లొస్తాను!” అన్నాడు. కీర్తిసేన ఒక్క క్షణం తటపటాయించి, “కొంచం ఆగండి.
ఇలా నా వెంట రండి.” అంటూ ముందుకు దారి తీసింది. ఇద్దరూ కొద్దిసేపు నడిచి, బాగా చదును చేసివున్న ఒక ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ నల్లరాతిల్తో చేసిన ఆరడుగుల శక్తివిగ్రహం ఒకటి వున్నది. కీర్తిసేన సత్యపాలుడితో, “ఈమేను స్వయంశక్తి దేవతగా మేం ఆరాధిస్తాం.
ఈ దేవత ఆశీర్వాదం వుంటే, అన్ని చిక్కులూ విడిపోతాయని, మా దృఢ విశ్వాసం!” అన్నది. సత్యపాలుడు, స్వయంశక్తి దేవతకు భక్తీగా నమస్కరించి, రెండు మస్సాలు తర్వాత, ఇదే రోజున అక్కడే కలుసుకుంటానని చెప్పి, రాజధానికి ప్రయాణమయ్యాడు.
ఆ మర్నాటి నుంచే, అతడి ఆజ్ఞ ప్రకారం లంచగొండులుగా పేరుబడ్డ ఉన్నతాధికారులు బంధింప బడ్డారు. సత్యపాలుది నాయకత్వంలో సైనికులు జట్టుజట్టుగా చీల దేశంలోని అన్ని రకాల దొంగలనూ బంధించి కారాగారంలో వేసారు. ఇలా రెండు మాసాలు గడిచాయి.
సత్యపాలుడు ముందు చెప్పినట్టే, భిల్లదేసపు పొలిమేరల్లో పురుష వేషంలో వున్న కీర్తిసేనను కలుసుకున్నాడు. అతడు, ఆమెతో, “కీర్తిసేన!
స్వయంశక్తి దేవత దయవల్ల నా చిక్కులన్నీ విడిపోయాయి. నాకు ఇంత మహోపకారం చేసిన నీకు ఎంతైనా ఋణపడి వున్నాను. నాతోబాటు మా రాజ్యానికి వచ్చి, మహారాణి పదవిని అలంకరించి, నన్ను కాస్త అయిన ఋణ విముక్తుణ్ణి చేయమని కోరుతున్నాను.” అన్నాడు.
కీర్తిసేన బదులు చెప్పక తల వంచుకున్నది. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే, కీర్తిసేన అన్న వీరసేనుడు, అనేకమైన కానుకలతో సత్యపాలుడిని కలుసుకుని, తన చెల్లెలను వివాహమాడవలసిందిగా కోరాడు. సత్యపాలుడు అంగీకరించాడు. మరి కొద్ది రోజుల్లోనే కీర్తిసేనా, సత్యపాలుల వివాహం జరిగింది. వివాహ సంరంభం ముగిసీ ముగియడంతోనే, మామగారి సైన్యాన్ని కూడా వెంట బెట్టుకుని, మహిరదేశం మీద దండెత్తాడు, సత్యపాలుడు. యుద్ధంలో ప్రచండవర్మ చెట్టుగా ఓడిపోయి, సత్యపాలుడిని కలుసుకుని, “నాయనా సత్యపాలా! పోయిన రాజ్యం మీద నాకు ఆశ లేదు.
కాని, నాకున్న ఒక్కగానొక్క కుమార్తె మధూలిక, నీ మీద అధిమానం పెంచుకుంది. ఆమెను రాణిగా స్వీకరించమని వేడుకుంటున్నాను.” అంటూ దీనంగా కోరాడు. ఇందుకు సత్యపాలుడు అంగీకరించి, మదూలికను వివాహం చేసుకున్నాడు. తర్వాత ప్రచండవర్మను తనకు సామంత రాజుగా నియమించి, కీర్తిసేనా మదూలికలతో చందన దేశానికి తిరిగి వెళ్ళాడు. భేతాళుడు ఈ కథ చెప్పి, “రాజా, తండ్రి భోగలాలసత కారణంగా, ఆ రాజిక పరిస్థితిలో వున్న దేశాన్ని చిన్నాభిన్నం కాకుండా సత్యపాలుడు కాపాడిన మాట నిజం.
ఇందుకు రాజనీతి, చతురత అవసరంలేదు. పట్టుదలా, కార్యదీక్షా వుంటే చాలు. పరరాజుల పట్ల ప్రవర్తించే తీరులోనే ఒక నిలకడగాల రాజనీతి చతురత అవసరం అవుతుంది. అలాంటిది సత్యపాలుడిలో వున్నట్టు లేదు. చంద్రపాలుడు గడ్డుసమస్యలు కల్పించినట్టుగానే, సత్యపాలుడు రాజనీతి లోపం, అతడి వారసుడికి ప్రమాదకారణం కావచ్చు. అతడి నిలకడలేని స్వభావానికి ఉదాహరణ, మధూలిక విషయంలో అతడు ప్రవర్తించిన తీరు.
తనకు తానై మదూలికను పెళ్లి చేసుకుంటానని చెప్పడానికి నిరాకరించినవాడు, కీర్తిసేన విషయంలో మరొక విషంగా ప్రవర్తించాడు. పోనీ మధూలిక అహంకారి అని తిరస్కరించాదంటే, ఆమెనూ చేపట్టాడు. ఇదంతా చూస్తుంటే, తండ్రి ఒక కారణంగా రాజ్యపాలనకు అనర్హుడైతే, సత్యపాలుడు మరొక కారణంగా అనర్హుడుగా కనిపించడం లేదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసికూడా చెప్పకపోయావో, నీ తల పగిలిపోతుంది.” అన్నాడు. దానికి విక్రమార్కుడు, “సత్యపాలుడు అన్ని విధాలా రాజ్యపాలనకు అర్హుదన్న సంగతి, అతడు అధికారానికి వచ్చినప్పటినుంచీ ప్రవర్తించిన తీరును బట్టి మనం నిర్ణయించవచ్చు. అంతరంగిక సమస్యలు కంటే, పొరుగు రాజులు సృష్ఠించే సమస్యలకే అధిక ప్రాముఖ్యత ఇవ్వాలన్న మంత్రి కేవలభట్ట సలహాలు తోసి పుచ్చాడంలోనే, అతడి రాజనీతి, చతురత వెల్లడవుతున్నది.
ప్రజాభిమానం రాజుకు లక్షల సైన్యంపెట్టు! అది రాజుకు స్తానబలాన్ని, అన్గాబలాన్నీ సంపాదించి పెడుతుంది.
అది ఎరిగిన వాడు గనకే సత్యపాలుడు ముందుగా ప్రభుత్వోద్యోగుల్లోని అవినీతిని, ఆ కారణంగా దేశంలో ప్రబలిన అరాచాకాన్నీ అణచివేసాడు. భిల్లరాజు జయసేనుడు తన దేశానికి స్వాతంత్ర్యం కోరుకున్నాడు తప్పితే, రాజు ప్రచందవర్మలా అదను చూసి చందన దేశాన్ని కబలించాలనే ఆలోచన చేయలేదు. కీర్తిసేన, తను సత్యపాలుది పట్ల మనసున్న దానినని పరోక్షంగా తెలియపరిచెందుకే, అతణ్ణి తన దేవి దగ్గరకు తీసుకు వెళ్ళింది. అందువల్లనే మదూలికను తానై కోరి వివాహమాడడానికి నిరాకరించినవాడు, ఆమెను తానై మహారానివి కమ్మని కోరాడు. అధముల్ని అడిగి అవుననిపించుకోవడమంటే, ఉత్తముల్ని అడిగి లేదని పించుకోవడం మేలన్న సూక్తి అందరేరిగినదే. అహంకారి అయిన మధూలిక, తనకు సత్యపాలుది మీద అభిమానం వున్నా, తండ్రి యుద్ధ ప్రయత్నాలను వారించలేదు. అంటే – తండ్రి యుద్ధంలో సత్యపాలుడిని గెలిచి, తనకు బహుమతిగా సమర్పిస్తాడన్న ఆలోచన ఆమెలో వుంది వుంటుంది.
కాని, పరిస్తితుడు మరొకలా పరిణమించడంతో, తండ్రి ప్రార్తనాపూర్వకంగా సత్యపాలుడిని కోరడం ద్వారా, అతణ్ణి వివాహమాడవలసి వచ్చింది. సత్యపాలుడు రాజ్యాధికారానికి వచ్చిన నాటినుంచీ జరిగిందంతా పరిశీలించినప్పుడు, అతడు గొప్ప రాజనీతిజ్ఞుడే కాక, పరిస్థితుల ప్రభావం బల్ల తారుమారయ్యే మానవ సంబంధాలను క్షుణ్ణంగా అర్ధం చేసుకుని, అందుకు అనుగుణంగా ప్రవర్తిన్చాగల వివేకి కూడా అని తెలుస్తున్నది.” అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే, బేతాళుడు శవంతో సహా మాయమై, మళ్ళీ చెట్టెక్కాడు. Source: Chandamama, August 1992.